Maria
Maria, mãe de Jesus, é honrada nas Escrituras como a mulher escolhida por Deus para trazer ao mundo o Salvador. Sua fé, humildade e obediência são exemplo para todos os cristãos.
A escolhida de Deus
O anjo Gabriel anunciou a Maria que ela seria mãe do Filho do Altíssimo. Ela respondeu com fé: 'Faça-se em mim segundo a tua palavra.'
ఎలీసబెతు గర్భవతియైన ఆరో నెలలో, దేవుడు గబ్రియేలు దూతను గలిలయలోని నజరేతు గ్రామానికి, దావీదు వంశస్థుడైన యోసేపుకు ప్రధానం చేయబడిన మరియ అనే కన్య దగ్గరకు పంపారు. ఆ దూత ఆమె దగ్గరకు వెళ్లి ఆమెతో, "బహుగా దయను పొందినదానా, నీకు శుభములు! ప్రభువు నీకు తోడై ఉన్నారు" అని చెప్పాడు.
అయితే ఆ దూత ఆమెతో, "మరియా, భయపడకు; నీవు దేవుని దయను పొందుకొన్నావు. నీవు గర్భం ధరించి, ఒక కుమారుని కంటావు, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టాలి. ఆయన గొప్పవాడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడని పిలువబడతారు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనాన్ని ఆయనకు ఇస్తారు. ఆయన యాకోబు వంశస్థులను నిరంతరం పరిపాలిస్తారు; ఆయన రాజ్యానికి అంతం ఉండదు" అని చెప్పాడు.
యేసు క్రీస్తు పుట్టుక ఇలా జరిగింది: ఆయన తల్లియైన మరియ యోసేపుకు ప్రధానం చేయబడింది. కానీ వారిద్దరు ఏకం కాక ముందే ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది.
O Magnificat
Maria cantou: 'Minha alma engrandece ao Senhor!' Seu cântico exalta a misericórdia, o poder e a fidelidade de Deus.
అందుకు మరియ:
"నా ఆత్మ ప్రభువును మహిమపరుస్తుంది.
నా రక్షకుడైన దేవునిలో నా ఆత్మ సంతోషిస్తుంది.
తన సేవకురాలి దీనస్థితిని
ఆయన గమనించారు.
ఇది మొదలుకొని తరతరాల వారు నన్ను ధన్యురాలు అంటారు,
ఎందుకంటే మహాఘనుడు నా కోసం గొప్ప కార్యాలను చేశారు,
పరిశుద్ధుడని ఆయనకు పేరు.
తరతరాల వరకు ఆయనకు భయపడేవారికి,
ఆయన కరుణ విస్తరిస్తుంది.
ఆయన తన బాహువుతో గొప్ప కార్యాలను చేస్తారు;
తమ అంతరంగాల్లో గర్వించు వారిని ఆయన చెదరగొట్టారు.
సింహాసనాల నుండి పరిపాలకులను క్రిందికి పడద్రోసారు,
కాని, దీనులను పైకి లేవనెత్తారు.
ఆకలిగొనిన వారిని మంచి పదార్ధాలతో తృప్తిపరిచారు,
కాని, ధనవంతులను వట్టి చేతులతో పంపారు.
ఆయన అబ్రాహాముకు అతని సంతతివారికి
నిత్యం దయ కలిగి ఉండాలని జ్ఞాపకం చేసుకొంటూ,
మన పితరులకు వాగ్దానం చేసినట్లు,
తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయం చేశారు."
కాబట్టి యోసేపు కూడా దావీదు వంశస్థుడు కాబట్టి, అతడు గలిలయ ప్రాంతంలోని నజరేతు గ్రామం నుండి, యూదయ ప్రాంతంలోని బేత్లెహేము అనే దావీదు పట్టణానికి వెళ్లాడు, ఎందుకంటే అతడు దావీదు వంశస్థుడు. తనతో పెండ్లికి ప్రధానం చేయబడి, గర్భవతిగా ఉన్న మరియతో పాటు తమ పేర్లను నమోదు చేయించుకోవడానికి వెళ్లాడు. వారు అక్కడ ఉన్నపుడు, ఆమె నెలలు నిండి, తన మొదటి కుమారుని కన్నది. సత్రంలో వారికి స్థలం దొరకలేదు, కాబట్టి ఆమె ఆ శిశువును మెత్తని గుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పడుకోబెట్టింది.
అయితే మరియ ఆ మాటలన్నింటిని తన హృదయంలో భద్రం చేసుకుని వాటి గురించి ఆలోచిస్తూ ఉండింది.
సుమెయోను వారిని దీవించి ఆయన తల్లియైన మరియతో: "ఇశ్రాయేలీయులలో అనేకమంది పడిపోవడానికి లేవడానికి కారణంగాను, వ్యతిరేకంగా చెప్పుకోడానికి గుర్తుగాను ఉండడానికి ఈ శిశువు నియమించబడ్డాడు, తద్వారా అనేకమంది హృదయాలోచనలు బయలుపరచబడతాయి, నీ హృదయంలోకి కూడా ఒక ఖడ్గం దూసికొనిపోతుంది."
ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి, విస్తుపోయారు. ఆయన తల్లి ఆయనతో, "కుమారుడా, ఎందుకు ఇలా చేశావు? నేను మీ తండ్రి ఆందోళన చెంది నీకోసం వెదకుతున్నాము" అన్నది.
అందుకు ఆయన, "మీరెందుకు నా కోసం వెదుకుతున్నారు? నేను నా తండ్రి ఇంట్లో ఉండాలని మీకు తెలియదా?" అని వారితో అన్నారు. అయితే ఆయన వారితో చెప్తున్న దానిని వారు గ్రహించలేకపోయారు.
ఆ తర్వాత యేసు వారితో కలిసి నజరేతుకు వెళ్లి వారికి లోబడి ఉన్నారు. అయితే ఆయన తల్లి ఈ సంగతులన్నిటిని తన హృదయంలో భద్రం చేసుకున్నది.
Mãe fiel até o fim
Maria acompanhou Jesus desde o nascimento até a cruz. Ela estava entre os discípulos no Pentecostes, fiel em oração.
అక్కడ ద్రాక్షరసం అయిపోయినప్పుడు, యేసు తల్లి ఆయనతో, "ద్రాక్షరసం అయిపోయింది" అని చెప్పింది.
అందుకు యేసు, "అమ్మా, దాంతో మనకేంటి? నా సమయం ఇంకా రాలేదు" అన్నారు.
ఆయన తల్లి పరిచారకులతో, "ఆయన మీతో చెప్పేది చేయండి" అని చెప్పింది.
యేసు తల్లి, ఆయన తల్లి సహోదరి, క్లోపా భార్య మరియ, మగ్దలేనే మరియ సిలువ దగ్గర నిలబడి ఉన్నారు. యేసు అతని తల్లి తాను ప్రేమించిన శిష్యుడు అక్కడ నిలబడి ఉండడం చూసి, ఆయన తన తల్లితో, "అమ్మా, ఇదిగో నీ కుమారుడు" అని, తర్వాత తన ఆ శిష్యునితో, "ఇదిగో నీ తల్లి" అని చెప్పారు. అప్పటినుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట్లో చేర్చుకున్నాడు.
ఆ తర్వాత యేసు తల్లి సహోదరులు వచ్చారు. వారు బయట నిలబడి, ఆయనను పిలువడానికి ఒకరిని లోపలికి పంపారు. జనసమూహం ఆయన చుట్టూ కూర్చుని ఉండగా, వారు ఆయనతో, "నీ తల్లి నీ సహోదరులు నిన్ను కలువడానికి వచ్చి బయట వేచి ఉన్నారు" అని చెప్పారు.
అందుకు ఆయన, "నా తల్లి నా సహోదరులు ఎవరు?" అని అడిగారు.
ఆయన తన చుట్టూ కూర్చున్న వారిని చూసి, "వీరే నా తల్లి, నా సహోదరులు! దేవుని చిత్తప్రకారం చేసేవారే నా సహోదరుడు, సహోదరి తల్లి" అని చెప్పారు.
ఇతడు వడ్రంగి కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు, యోసేపు, సీమోను, యూదా ఇతని సహోదరులు కారా? ఇతని సహోదరీలు అందరు మనతో లేరా? ఇతనికి ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి?" అని చెప్పుకొని అభ్యంతరపడ్డారు.
వీరితో పాటు కొందరు స్త్రీలు, యేసు తల్లియైన మరియ, ఆయన తమ్ముళ్ళు కలిసి, ఏకమనస్సుతో విడువక ప్రార్థిస్తున్నారు.