Pão
O pão é símbolo central na Bíblia: do maná no deserto ao pão da vida — Jesus. A Escritura usa o pão para ensinar sobre provisão divina, comunhão e dependência espiritual.
O maná do céu
Deus alimentou Israel no deserto com pão do céu. O maná era diário, fiel e suficiente — retrato da provisão constante de Deus.
అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నారు, "నేను ఇశ్రాయేలీయుల సణుగులు విన్నాను. వారితో ఇలా చెప్పు, ‘సాయంకాలం మీరు మాంసాన్ని తింటారు, ఉదయకాలం ఆహారం తిని తృప్తిపొందుతారు. అప్పుడు మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు.’ "
ఆ సాయంకాలం పూరేళ్ళు వచ్చి శిబిరం స్థలాన్ని కప్పివేశాయి, ఉదయకాలం ఆ శిబిరం చుట్టూ మంచు పొర ఉంది. ఆ మంచు కరిగిపోయిన తర్వాత, ఆ ఎడారి నేలమీద మంచుకణాల వంటి సన్నని కణాలు కనిపించాయి. ఇశ్రాయేలీయులు వాటిని చూసి, అది ఏమిటో వారికి తెలియక, "ఇదేమిటి?" అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.
మోషే వారితో, "ఇది మీరు తినడానికి యెహోవా ఇచ్చిన ఆహారము.
ఇశ్రాయేలీయులు ఈ ఆహారానికి మన్నా అని పేరు పెట్టారు. అది తెల్లగా కొత్తిమెర గింజల్లా ఉండి దాని రుచి తేనెతో చేసిన పల్చనిరొట్టెల వలె ఉంది.
అయినా ఆయన పైనున్న ఆకాశాలను
ఆకాశద్వారాలు తెరిచారు.
తినడానికి ప్రజలకు ఆయన మన్నా కురిపించారు.
పరలోకం నుండి ధాన్యం ఇచ్చారు.
మానవులు దేవదూతల ఆహారం తిన్నారు;
ఆయన వారికి సమృద్ధిగా ఆహారం పంపారు.
ఆయన పశువుల కోసం గడ్డి పెరిగేలా చేస్తున్నారు,
మనుష్యులు శ్రమించి సాగుచేయడానికి మొక్కలను మొలిపిస్తున్నారు,
అలా భూమి నుండి ఆహారాన్ని పుట్టిస్తున్నారు:
మానవ హృదయాలకు సంతోషం కలిగించడానికి ద్రాక్షరసాన్ని,
వారి ముఖాలను ప్రకాశించేలా చేయడానికి నూనెను,
వారి హృదయాలను బలపరిచే ఆహారాన్ని ఇస్తున్నారు.
O pão da vida
Jesus declarou: 'Eu sou o pão da vida.' Quem vem a Ele nunca terá fome, e quem nele crê jamais terá sede. Ele é o sustento eterno.
యేసు వారితో, "నేను మీతో ఖచ్చితంగా చెప్పుతున్నాను, మీకు పరలోకం నుండి ఆహారం ఇచ్చింది మోషే కాదు, పరలోకం నుండి నా తండ్రే నిజమైన ఆహారం మీకిస్తారు. ఎందుకంటే పరలోకం నుండి దిగి వచ్చి లోకానికి జీవం ఇచ్చేది దేవుడు ఇచ్చే ఆహారమని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను" అని చెప్పారు.
అందుకు వారు, "అయ్యా, ఈ ఆహారం మాకు ఎల్లప్పుడు ఇవ్వు" అన్నారు.
అప్పుడు యేసు వారితో ఇట్లన్నాడు: "జీవాహారం నేనే. నా దగ్గరకు వచ్చే వారికి ఎప్పుడు ఆకలివేయదు, నన్ను నమ్మేవారికి ఎప్పుడు దాహం వేయదు.
జీవాహారం నేనే. మీ పితరులు అరణ్యంలో మన్నాను తిని కూడా చనిపోయారు. అయితే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇక్కడ ఉంది. దీన్ని తినే వారెవరు చనిపోరు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే. ఈ ఆహారం ఎవరు తింటారో వారు నిరంతరం జీవిస్తారు. ఈ లోకాన్ని జీవింపచేసే ఈ జీవాహారం నా శరీరమే" అని చెప్పారు.
మనుష్యులు కేవలం ఆహారం వల్లనే జీవించరు కాని యెహోవా నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారు అని మీకు నేర్పించడానికి ఆయన మిమ్మల్ని అణచి మీకు ఆకలి కలిగించి మీకు గాని మీ పూర్వికులకు గాని ఇంతకుముందు తెలియని మన్నాతో మిమ్మల్ని పోషించారు.
అందుకు యేసు, " ‘మనుష్యులు కేవలం ఆహారం వల్లనే జీవించరు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారు’ అని వ్రాయబడి ఉంది" అని జవాబిచ్చారు.
Partilha e comunhão
O partir do pão une o corpo de Cristo. Na Ceia, na generosidade e na partilha, expressamos a comunhão com Deus e uns com os outros.
ఆ తర్వాత ఆయన ఒక రొట్టెను పట్టుకుని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, వారికిచ్చి, "ఇది మీ కోసం ఇవ్వబడుతున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయండి" అని చెప్పారు.
కాబట్టి మీరు ఈ రొట్టెను తిని, ఈ పాత్రలోనిది త్రాగిన ప్రతిసారి ప్రభువు వచ్చేవరకు ఆయన మరణాన్ని ప్రకటిస్తారు.
మనం కృతజ్ఞతలు తెలియజేయడానికి ఆశీర్వాదపు పాత్రలోనిది త్రాగడం క్రీస్తు రక్తంలో పాలుపుచ్చుకోవడమే కదా? మనం రొట్టె విరిచి తినడం క్రీస్తు శరీరంలో పాలుపంచుకోవడమే కదా? మనమందరం ఆ ఒకే రొట్టెను పంచుకుంటున్నాం, రొట్టె ఒక్కటే కాబట్టి అనేకులమైన మనం ఒకే శరీరంగా ఉన్నాము.
"మీరు ఈ విధంగా ప్రార్థన చేయాలి:
" ‘పరలోకమందున్న మా తండ్రీ,
మీ నామం పరిశుద్ధపరచబడును గాక,
మీ రాజ్యం వచ్చును గాక;
పరలోకంలో జరుగునట్లు భూమి మీద,
మీ చిత్తం జరుగును గాక.
మా అనుదిన ఆహారం ఈ రోజు మాకు ఇవ్వండి.
ధారాళంగా ఉన్నవారు ధన్యులు,
ఎందుకంటే వారు బీదలను పోషిస్తారు.
అందుకు యేసు, "మీరే వారికి భోజనం పెట్టండి" అన్నారు.
అందుకు వారు, "రెండువందల దేనారాల కంటే ఎక్కువవుతుంది. మేము వెళ్లి, అంత డబ్బు ఖర్చుపెట్టి రొట్టెలను కొని, వారికి పెట్టాలా?" అని ఆయనను అడిగారు.
అందుకు ఆయన, "మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి? వెళ్లి చూడండి" అని అడిగారు.
వారు వెళ్లి చూసి, "అయిదు రొట్టెలు, రెండు చేపలు ఉన్నాయి" అన్నారు.
అప్పుడు ఆయన వారందరిని గుంపులుగా పచ్చగడ్డి మీద కూర్చోపెట్టమని శిష్యులతో చెప్పారు. వారు వంద యాభైల చొప్పున గుంపులుగా కూర్చున్నారు. అప్పుడు ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను చేతిలో పట్టుకుని ఆకాశం వైపు కళ్ళెత్తి, కృతజ్ఞత చెల్లించి ఆ రొట్టెలను విరిచారు. తర్వాత ప్రజలకు పంచిపెట్టడానికి తన శిష్యులకు ఇచ్చారు. ఆయన ఆ రెండు చేపలను కూడా వారందరికి విభజించారు. వారందరు తిని తృప్తి పొందారు. తర్వాత శిష్యులు మిగిలిన రొట్టె ముక్కలను చేప ముక్కలను పన్నెండు గంపల నిండా నింపారు.
Provisão divina
O justo não é desamparado e seus descendentes não mendigam pão. Deus provê com fidelidade o alimento de cada dia.
ఒకప్పుడు నేను యవ్వనస్థుడను ఇప్పుడు ముసలివాడినయ్యాను,
అయినాసరే నీతిమంతులు విడిచిపెట్టబడడం
వారి పిల్లలు ఆహారం అడుక్కోవడం నేనెప్పుడు చూడలేదు.
పరిసయ్యులు, సద్దూకయ్యుల పులిసిన పిండి
యేసు శిష్యులు అవతలి ఒడ్డుకు వెళ్లినప్పుడు వారు రొట్టెలు తీసుకెళ్లడం మరచిపోయారు. యేసు వారితో, "పరిసయ్యుల, సద్దూకయ్యుల పులిసిన పిండి విషయంలో జాగ్రత్తగా ఉండండి" అని వారితో చెప్పారు.
కాబట్టి వారు, "మనం రొట్టెలు తీసుకురాలేదు కాబట్టి ఇలా అన్నారు" అని తమలో తాము చర్చించుకున్నారు.
వారు ఏమి చర్చించుకుంటున్నారో తెలిసినవాడై యేసు, "అల్పవిశ్వాసులారా, రొట్టెలు లేవని మీలో మీరు ఎందుకు మాట్లాడుకుంటున్నారు? మీరు ఇంకా గ్రహించలేదా పోతున్నారా? అయిదు రొట్టెలు అయిదు వేలమందికి పంచినప్పుడు మీరు ఎన్ని గంపలు ఎత్తారు? లేదా ఏడు రొట్టెలు నాలుగు వేలమందికి పంచినప్పుడు, ఎన్ని గంపలు ఎత్తారు? నేను మీతో మాట్లాడుతుంది రొట్టెల గురించి కాదని మీకెందుకు అర్థం కాలేదు? మీరు పరిసయ్యులు, సద్దూకయ్యుల యొక్క పులిసిన పిండిని గురించి జాగ్రత్తగా ఉండండి" అని వారితో చెప్పారు. అప్పుడు పులిసిన రొట్టెల పిండిని గురించి కాదు గాని పరిసయ్యులు, సద్దూకయ్యులు చేస్తున్న బోధ గురించి జాగ్రత్త అని యేసు తమతో చెప్పాడని వారు గ్రహించారు.
అనేక చోట్ల పెట్టుబడి
మీ ధాన్యాన్ని సముద్రం గుండా రవాణ చేయండి;
చాలా రోజుల తర్వాత దాని నుండి మీరు లాభం పొందవచ్చు.
ఏడు ఎనిమిదింటిలో పెట్టుబడి పెట్టండి;
దేశంలో ఎలాంటి విపత్తు వస్తుందో మీకు తెలియదు.