44 మోషే చూసిన నమూనా చొప్పున సాక్షపు గుడారం చేయాలని దేవుడు అతనితో మాట్లాడి ఆజ్ఞాపించాడు. ఆ సాక్షపు గుడారం అరణ్యంలో మన పితరుల దగ్గర ఉండేది. 45 మన పూర్వీకులు దాన్ని తీసుకుని, దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనాలను వారు స్వాధీనపర్చుకున్నప్పుడు, యెహోషువతో కూడ ఈ దేశంలోకి దాన్ని తీసుకొచ్చారు. అది దావీదు కాలం వరకూ ఉంది. 46 దావీదు దేవుని అనుగ్రహం పొంది యాకోబు దేవునికి నివాస స్థలాన్ని నిర్మించాలని ఆశించాడు. 47 కాని సొలొమోను మందిరం కట్టించాడు.
48 "అయితే, ప్రవక్త చెప్పినట్టుగా సర్వోన్నతుడు మనుషుల చేతులతో చేసిన ఇళ్ళలో నివసించడు.
49 ‘ఆకాశం నా సింహాసనం,
భూమి నా పాదపీఠం.
మీరు నాకోసం ఎలాంటి ఇల్లు కడతారు?
నా విశ్రాంతి స్థలమేది?
50 ఇవన్నీ నా చేతిపనులు కావా?
అని ప్రభువు అడుగుతున్నాడు.’