13 రాత్రి కలిగిన దర్శనాలను నేనింకా చూస్తుండగా,
ఆకాశ మేఘాలపై వస్తున్న మనుష్య కుమారుణ్ణి పోలిన ఒకడు వచ్చాడు.
ఆ మహా వృద్ధుని సన్నిధిలో ప్రవేశించాడు.
ఆయన సముఖానికి అతణ్ణి తీసుకు వచ్చారు.
14 సకల ప్రజలు, రాష్ట్రాలు, వివిధ భాషలు మాటలాడేవారు ఆయన్ని సేవించేలా ప్రభుత్వం,
మహిమ, ఆధిపత్యం ఆయనకు ఇవ్వబడింది.
ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది. అదెన్నటికీ తొలగిపోదు.
ఆయన రాజ్యం ఎప్పటికీ లయం కాదు.