11 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు. "నేను ఇశ్రాయేలు ప్రజల సణుగులు విన్నాను. 12 వాళ్ళతో ఇలా చెప్పు. సాయంత్రం పూట మీరు మాంసం తింటారు, ఉదయం పూట తృప్తిగా ఆహారం తింటారు. అప్పుడు నేను మీ దేవుడైన యెహోవాను అని మీరు తెలుసుకుంటారు." 13 అలాగే జరిగింది. సాయంకాలం అయినప్పుడు పూరేడు పిట్టలు వచ్చి శిబిరం అంతా కమ్ముకున్నాయి. ఉదయమయ్యాక శిబిరం అంతా మంచు పడి ఉంది. 14 నేలపై మంచు ఇంకిపోయాక నేలమీద సన్నని కణాలు పొరలుగా ఎడారి భూమి మీద కనబడ్డాయి. 15 ఇశ్రాయేలీయులు దాన్ని చూసి, అది ఏమిటో తెలియక "ఇదేంటి?" అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.