18 కొందరు మనుషులు పక్షవాత రోగిని పరుపు మీద మోసుకు వచ్చారు. అతణ్ణి లోపలికి తెచ్చి, ఆయన ముందు ఉంచాలని చూశారు గాని 19 ప్రజలు కిక్కిరిసి ఉండడం చేత అతణ్ణి లోపలికి తేవడానికి వీలు కాలేదు. కాబట్టి, వారు ఇంటికప్పు మీదికెక్కి పెంకులు తీసి పరుపుతో పాటు రోగిని సరిగ్గా యేసు ముందే దింపారు.
20 యేసు వారి విశ్వాసం చూసి, "అయ్యా, నీ పాపాలకు క్షమాపణ దొరికింది" అన్నాడు. 21 శాస్త్రులూ పరిసయ్యులూ, "దేవదూషణ చేస్తున్న ఇతడు ఎవడు? దేవుడు తప్ప పాపాలు ఎవరు క్షమించగలరు?" అనుకున్నారు 22 యేసు వారి ఆలోచన గ్రహించి, "మీరు మీ హృదయాల్లో అలా ఎందుకు ఆలోచిస్తున్నారు? 23 ఏది సులభమంటారు? ‘నీ పాపాలు క్షమిస్తున్నాను’ అనడమా, ‘లేచి నడువు’ అనడమా? 24 అయితే మనుష్యకుమారుడికి భూమి మీద పాపాలు క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలి" అన్నాడు.
తరువాత పక్షవాత రోగిని చూసి, "లేచి, నీ పరుపు తీసుకుని ఇంటికి వెళ్ళు" అన్నాడు. 25 వెంటనే వాడు వారి ముందే లేచి నిలబడి, తాను పడుకున్న పరుపు ఎత్తుకుని, దేవుణ్ణి స్తుతిస్తూ తన ఇంటికి వెళ్ళాడు.