బర్తిమయి చూపు పొందడం
46 ఆ తరువాత వారు యెరికో చేరుకున్నారు. యేసు, ఆయన శిష్యులు, వారితో ఉన్న జనసమూహం ఆ పట్టణాన్ని వదిలి బయలుదేరారు. తీమయి కుమారుడు బర్తిమయి అనే ఒక గుడ్డివాడు దారి పక్కన కూర్చుని ఉన్నాడు. అతడు భిక్షగాడు. 47 ఆ గుడ్డివాడు, వస్తున్నది నజరేయుడైన యేసు అని తెలుసుకుని, "యేసూ! దావీదు కుమారా! నా మీద దయ చూపు!" అని కేకలు పెట్టసాగాడు. 48 చాలా మంది అతణ్ణి గద్దించి ఊరుకోమన్నారు. కాని ఆ గుడ్డివాడు, "దావీదు కుమారా! నా మీద దయ చూపు!" అని ఇంకా పెద్దగా కేకలు వేశాడు.
49 యేసు ఆగి, "అతణ్ణి పిలవండి" అన్నాడు. ప్రజలు ఆ గుడ్డివానితో, "ధైర్యంగా ఉండు! లే! ఆయన నిన్ను పిలుస్తున్నాడు" అన్నారు. 50 ఆ గుడ్డివాడు తాను కప్పుకొన్న పైబట్టను అవతల పారవేసి, గభాలున లేచి యేసు దగ్గరికి వెళ్ళాడు. 51 యేసు, "ఏం కావాలి?" అని అడిగాడు. ఆ గుడ్డివాడు, "రబ్బీ! నాకు మళ్లీ చూపు ప్రసాదించు" అని వేడుకున్నాడు. 52 యేసు, "నీ విశ్వాసం నిన్ను బాగుచేసింది, ఇక వెళ్ళు" అన్నాడు. వెంటనే అతనికి చూపు వచ్చింది. అతడు యేసును అనుసరిస్తూ ఆయనతో వెళ్ళాడు.