23 యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు, "నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం. 24 ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూదిరంధ్రంలో గుండా ఒంటె దూరి వెళ్ళడం తేలిక." 25 శిష్యులు ఈ మాట విని చాలా ఆశ్చర్యపోయారు. "ఇలా అయితే ఇంకెవరు పరలోకంలో ప్రవేశించగలరు?" అన్నారు. 26 యేసు వారితో, "ఇది మానవులకు అసాధ్యమే. కానీ, దేవునికి సమస్తమూ సాధ్యమే" అని చెప్పాడు.