1 అప్పుడు కిర్యత్-యారీము ప్రజలు వచ్చి యెహోవా మందసాన్ని తీసుకెళ్లారు. వారు దానిని కొండమీద ఉన్న అబీనాదాబు ఇంటికి తీసుకువచ్చి యెహోవా మందసానికి కాపాడడానికి అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించారు. 2 యెహోవా మందసం కిర్యత్-యారీములో ఇరవై సంవత్సరాలు ఉంది.
మిస్పా దగ్గర ఫిలిష్తీయులను అణచివేసిన సమూయేలు
ఇశ్రాయేలు ప్రజలంతా మళ్ళీ యెహోవా వైపు తిరిగారు.