పేతురు జనసమూహంతో మాట్లాడుట
14 అప్పుడు పేతురు ఆ పదకొండు మందితో పాటు నిలబడి, బిగ్గరగా ఆ జనసమూహంతో ఇలా అన్నాడు: "తోటి యూదులారా యెరూషలేములో ఉంటున్నవారలారా, నేను మీకు దీని గురించి వివరిస్తాను; నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. 15 మీరందరు అనుకుంటున్నట్లు, వీరు మద్యం త్రాగిన మత్తులో లేరు. ఇప్పుడు ఉదయం తొమ్మిది గంటలు అవుతుంది! 16 యోవేలు ప్రవక్త ఇలా చెప్పాడు:
17 " ‘దేవుడు ఇలా చెప్తున్నారు, చివరి రోజుల్లో,
నేను ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను.
మీ కుమారులు, కుమార్తెలు ప్రవచిస్తారు,
మీ యువకులు దర్శనాలు చూస్తారు,
మీ వృద్ధులు కలలు కంటారు.