ఫిలిప్పును నతనయేలును పిలిచిన యేసు
43 మరుసటిరోజు యేసు గలిలయకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆయన ఫిలిప్పును చూసి, "నన్ను వెంబడించు" అని చెప్పారు.
44 ఫిలిప్పు కూడా పేతురు, అంద్రెయల పట్టణమైన బేత్సయిదాకు చెందిన వాడు. 45 ఫిలిప్పు నతనయేలును చూసి అతనితో, "ధర్మశాస్త్రంలో మోషే, ప్రవక్తలు ఎవరి గురించి వ్రాసారో ఆయనను మేము కనుగొన్నాము. ఆయనే యోసేపు కుమారుడైన, నజరేయుడైన యేసు" అని చెప్పాడు.