15 వారు తిని ముగించిన తర్వాత యేసు సీమోను పేతురుతో, "యోహాను కుమారుడవైన సీమోనూ, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?" అని అడిగారు.
అతడు, "అవును, ప్రభువా! నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు" అన్నాడు.
అయితే, "నా గొర్రెపిల్లలను మేపుము" అని యేసు చెప్పారు.
19 పేతురు ఎలాంటి మరణం పొంది దేవుని మహిమపరుస్తాడో సూచిస్తూ యేసు ఈ విషయాలను చెప్పారు. ఇలా చెప్పి ఆయన అతనితో, "నన్ను వెంబడించు" అని చెప్పారు.