46 ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చిన గలిలయలోని కానాకు మరలా వచ్చారు. కపెర్నహూములో ఒక రాజ్యాధికారి కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడు. 47 యేసు యూదయ ప్రాంతం నుండి గలిలయకు వచ్చాడని ఆ రాజ్యాధికారి విని ఆయన దగ్గరకు వెళ్లి, చనిపోతున్న తన కుమారుని స్వస్థపరచుమని బ్రతిమాలుకున్నాడు.
48 యేసు అతనితో, "మీరు అద్భుతకార్యాలు, మహత్కార్యాలను చూస్తేనే తప్ప నమ్మరు" అన్నారు.
49 ఆ రాజ్యాధికారి, "అయ్యా, నా బిడ్డ చనిపోకముందే దయచేసి రండి" అని వేడుకున్నాడు.
50 యేసు, "వెళ్లు, నీ కుమారుడు బ్రతుకుతాడు" అని చెప్పారు.
యేసు మాటను నమ్మి అతడు వెళ్లిపోయాడు. 51 అతడు ఇంకా దారిలో ఉండగానే, అతని పనివారు అతన్ని కలిసి అతని కుమారుడు బాగయ్యాడని చెప్పారు. 52 అతడు తన కుమారుడు ఏ సమయంలో బాగుపడ్డాడని వారిని అడిగినప్పుడు, "నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకు అతని జ్వరం తగ్గిపోయింది" అని వారు చెప్పారు.
53 అప్పుడు ఆ తండ్రి యేసు తనతో, "నీ కుమారుడు బ్రతుకుతాడు" అని సరిగ్గా అదే సమయంలో చెప్పారని గ్రహించి అతడు, అతని ఇంటివారందరు నమ్మారు.
54 యేసు యూదయ ప్రాంతం నుండి గలిలయకు వచ్చిన తర్వాత ఆయన చేసిన రెండవ సూచకక్రియ ఇది.