యేసు పుట్టుక గురించి ముందుగానే చెప్పబడుట
26 ఎలీసబెతు గర్భవతియైన ఆరో నెలలో, దేవుడు గబ్రియేలు దూతను గలిలయలోని నజరేతు గ్రామానికి, 27 దావీదు వంశస్థుడైన యోసేపుకు ప్రధానం చేయబడిన మరియ అనే కన్య దగ్గరకు పంపారు. 28 ఆ దూత ఆమె దగ్గరకు వెళ్లి ఆమెతో, "బహుగా దయను పొందినదానా, నీకు శుభములు! ప్రభువు నీకు తోడై ఉన్నారు" అని చెప్పాడు.
29 అతని మాటలకు మరియ చాలా కలవరపడి, ఇది ఎటువంటి శుభవచనమో అని ఆశ్చర్యపడింది. 30 అయితే ఆ దూత ఆమెతో, "మరియా, భయపడకు; నీవు దేవుని దయను పొందుకొన్నావు. 31 నీవు గర్భం ధరించి, ఒక కుమారుని కంటావు, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టాలి. 32 ఆయన గొప్పవాడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడని పిలువబడతారు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనాన్ని ఆయనకు ఇస్తారు. 33 ఆయన యాకోబు వంశస్థులను నిరంతరం పరిపాలిస్తారు; ఆయన రాజ్యానికి అంతం ఉండదు" అని చెప్పాడు.
34 మరియ ఆ దూతతో, "నేను కన్యను కదా, అదెలా సాధ్యం?" అని అడిగింది.
35 అందుకు ఆ దూత, "పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. కాబట్టి పుట్టబోయే పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడతాడు.1:35 లేదా పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు అని పిలువబడతాడు 36 నీ బంధువురాలు ఎలీసబెతు కూడ తన ముసలితనంలో గర్భం ధరించింది, పిల్లలు పుట్టరు అని ఎవరి గురించైతే అనుకున్నారో, ఆమెకు ఇప్పుడు ఆరో నెల నిండింది. 37 ఎందుకంటే దేవుని నుండి వచ్చే ఏ మాట నెరవేరక మానదు" అన్నాడు.
38 అందుకు మరియ, "నేను ప్రభువు దాసురాలను, నీవు చెప్పిన ప్రకారం నాకు జరుగును గాక" అని అన్నది. తర్వాత దూత వెళ్లిపోయాడు.