14 ఆయన వారిని చూసి, వారితో, "మీరు వెళ్లి, మిమ్మల్ని మీరు యాజకులకు కనుపరచుకోండి" అన్నారు. వారు వెళ్తుండగానే వారు శుద్ధులయ్యారు.
15 అందులో ఒకడు, తనకు స్వస్థత కలిగిందని చూసుకొని, బిగ్గరగా దేవుని స్తుతిస్తూ తిరిగి వచ్చాడు. 16 అతడు యేసు పాదాల ముందు సాగిలపడి ఆయనకు కృతజ్ఞత చెప్పాడు. అతడు సమరయుడు.
17 యేసు, "పదిమంది శుద్ధులయ్యారు కదా, మిగిలిన తొమ్మిదిమంది ఎక్కడ? 18 ఈ సమరయుడు తప్ప దేవుని స్తుతించడానికి ఇంకెవరు తిరిగి రాలేదా?" అని అడిగారు. 19 ఆ తర్వాత వానితో, "నీవు లేచి వెళ్లు; నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచింది" అన్నారు.