గ్రుడ్డి భిక్షగానికి చూపునిచ్చిన యేసు
35 యేసు యెరికో పట్టణ సమీపంలో ఉన్నపుడు, ఒక గ్రుడ్డివాడు దారి ప్రక్కన కూర్చుని భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. 36 జనసమూహం వెళ్తుందని వాడు విని, "ఆ సందడేంటి?" అని అడిగాడు. 37 "నజరేతువాడైన యేసు ఈ దారిలో వెళ్తున్నాడు" అని వారు జవాబిచ్చారు.
38 అందుకతడు బిగ్గరగా, "యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించు!" అని కేకలు వేశాడు.
39 ఆ దారిలో వెళ్లేవారు వాన్ని గద్దించారు, నిశ్శబ్దంగా ఉండమని వానికి చెప్పారు. కాని వాడు, "దావీదు కుమారుడా, నన్ను కరుణించు!" అని ఇంకా బిగ్గరగా కేకలు వేశాడు.
40 తర్వాత యేసు నిలబడి, వానిని తన దగ్గరకు తీసుకుని రమ్మన్నాడు. వాడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు యేసు వానితో, 41 "నేను నీకు ఏమి చేయాలని కోరుతున్నావు?" అని అడిగారు.
"ప్రభువా, నాకు చూపు కావాలి!" అని వాడు అన్నాడు.
42 యేసు వానితో, "నీవు చూపును పొందుకో; నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచింది!" అన్నారు. 43 వెంటనే వాడు చూపు పొందుకొని, దేవుని స్తుతిస్తూ యేసును వెంబడించాడు. ప్రజలందరు ఇది చూసి, వారు కూడా దేవునిని స్తుతించారు.