యేసు తుఫానును శాంతింపచేయుట
22 ఒక రోజు యేసు తన శిష్యులతో, "మనం సరస్సు అవతలి వైపుకి వెళ్దాం పదండి" అన్నారు, వారు పడవ ఎక్కి బయలుదేరారు. 23 వారు ప్రయాణం చేస్తూ ఉండగా, యేసు నిద్రపోయారు. అంతలో భయంకరమైన తుఫాను సరస్సు మీదికి వచ్చి, పడవంతా నీళ్లతో నిండిపోవడం మొదలుపెట్టింది, వారు ఎంతో ప్రమాదంలో ఉన్నారు.
24 కాబట్టి శిష్యులు ఆయన దగ్గరకు వెళ్లి, "బోధకుడా, బోధకుడా, మేము మునిగిపోతున్నాం" అని అంటూ ఆయనను లేపారు.
ఆయన లేచి, గాలిని ఉప్పొంగుతున్న నీటిని గద్దించగానే, తుఫాను ఆగింది, అంతా ప్రశాంతంగా మారింది. 25 అప్పుడు ఆయన, "మీ విశ్వాసం ఎక్కడ?" అని తన శిష్యులను అడిగారు.
అయితే వారు విస్మయంతో భయపడుతూ ఒకనితో ఒకడు, "ఈయన ఎవరు? గాలిని నీళ్లను ఈయన ఆజ్ఞాపించగానే, అవి లోబడుతున్నాయి" అని చెప్పుకొన్నారు.
దయ్యం పట్టిన వానికి యేసు విడుదల కలుగచేయుట
26 వారు గలిలయ సరస్సును దాటి, గెరాసేనీయులు నివసించు ప్రాంతాన్ని చేరుకొన్నారు.