49 యేసు ఇంకా మాట్లాడుతుండగా, సమాజమందిరపు నాయకుడైన యాయీరు ఇంటి నుండి ఒకడు వచ్చాడు, యాయీరుతో, "నీ కుమార్తె చనిపోయింది, ఇక బోధకునికి శ్రమ కలిగించవద్దు" అని చెప్పాడు.
50 వారి మాటలను విని, యేసు యాయీరుతో, "భయపడకు, నమ్మకం మాత్రం ఉంచు, నీ కుమార్తె స్వస్థపడుతుంది" అని చెప్పారు.
51 ఆయన యాయీరు ఇల్లు చేరిన తర్వాత, పేతురు, యోహాను, యాకోబు ఆ బాలిక తల్లిదండ్రులును తప్ప మరి ఎవరిని లోనికి రానివ్వలేదు. 52 ఆ సమయంలో, ప్రజలందరు ఆమె కోసం ఏడుస్తూ రోదిస్తున్నారు. అప్పుడు యేసు, "ఏడ్పు ఆపండి! ఈమె చనిపోలేదు కానీ నిద్రపోతుంది" అన్నారు.
53 ఆమె చనిపోయిందని తెలిసి, వారు ఆయనను ఎగతాళి చేశారు. 54 అయితే ఆయన ఆమె చేయి పట్టుకుని ఆమెతో, "చిన్నదానా, లే!" అన్నారు. 55 అప్పుడు ఆమెకు ప్రాణం తిరిగి వచ్చింది, ఆమె వెంటనే లేచి నిలబడింది. అప్పుడు ఆయన, "ఆమెకు తినడానికి ఏమైన ఇవ్వండి" అని వారితో చెప్పారు. 56 ఆమె తల్లిదండ్రులు అది చూసి ఆశ్చర్యపడ్డారు, అయితే ఆయన జరిగింది ఎవరికీ చెప్పకూడదు అని వారిని ఆదేశించారు.