యేసు దేవాలయంలో పన్ను చెల్లించుట
24 తర్వాత యేసు తన శిష్యులతో కపెర్నహూము పట్టణానికి చేరినప్పుడు, అర షెకెలు ఆలయ పన్ను వసూలు చేసేవారు పేతురు దగ్గరకు వచ్చి, "మీ బోధకుడు ఆలయ పన్ను చెల్లించడా?" అని అడిగారు.
25 అందుకు పేతురు, "చెల్లిస్తాడు" అని జవాబిచ్చాడు.
పేతురు ఇంట్లోకి వచ్చినప్పుడు యేసు ముందుగా మాట్లాడుతూ, అతన్ని, "సీమోనూ, నీవేమి అనుకుంటున్నావు? ఈ భూ రాజులు మందిర పన్ను ఎవరి దగ్గర వసూలు చేయాలి? సొంత కుమారుల దగ్గరా లేదా బయటి వారి దగ్గరా?" అని అడిగారు.
26 అందుకు పేతురు, "బయటి వారి దగ్గరే" అని చెప్పాడు.
అందుకు యేసు, "అలాగైతే కుమారులు పన్నుకట్టే అవసరం లేదు. 27 కాని మనం వారికి అభ్యంతరకరంగా ఉండకూడదు, కాబట్టి నీవు సముద్రానికి వెళ్లి నీ గాలం వేయి. నీవు పట్టిన మొదటి చేపను తీసుకో, దాని నోటిని తెరిస్తే దానిలో నీకు ఒక షెకెలు నాణెము దొరుకుతుంది. అది తీసుకుని నా కోసం నీకోసం పన్ను చెల్లించు" అని చెప్పారు.