33 కాబట్టి వారు యెహోవా పర్వతం నుండి బయలుదేరి మూడు రోజులు ప్రయాణించారు. వారి విశ్రాంతి స్థలం కోసం ఈ మూడు రోజులు యెహోవా నిబంధన మందసం వారికి ముందుగా వెళ్లింది. 34 వారు ప్రయాణం మొదలుపెట్టినప్పుడు యెహోవా మేఘము పగలు వారి మీద ఉంది.
35 మందసం ఎప్పుడు బయలుదేరుతుందో అప్పుడు మోషే బిగ్గరగా,
"యెహోవా, లేవండి!
మీ శత్రువులు చెదిరిపోవుదురు గాక;
మీ ఎదుట నుండి మీ శత్రువులు పారిపోవుదురు గాక"
అని అనేవాడు.
36 మందసం ఆగినప్పుడు, అతడు,
"యెహోవా, లెక్కలేనంతగా ఉన్న
వేలాది ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు తిరిగి రండి"
అని అనేవాడు.