Misericórdia
A misericórdia de Deus é eterna e inesgotável. Ele se compadece dos que sofrem, perdoa os arrependidos e derrama graça sobre os que não merecem. Grande é a sua fidelidade.
A misericórdia de Deus
Quem é Deus como tu, que perdoa a iniquidade? Ele se deleita em ter misericórdia e não retém a ira para sempre.
మీలాంటి దేవుడెవరు?
మీరు మీ వారసత్వమైన వారిలో మిగిలిన వారి
పాపాలను మన్నించి, అతిక్రమాలను క్షమిస్తారు,
మీరు నిత్యం కోపంతో ఉండరు
కాని దయ చూపడంలో ఆనందిస్తారు.
ఓ దేవా, మీ మారని ప్రేమను బట్టి
నన్ను కరుణించండి;
మీ గొప్ప కనికరాన్ని బట్టి,
నా పాపాలను తుడిచివేయండి.
నా దోషాలన్నింటిని కడిగి,
నా పాపము నుండి నన్ను శుభ్రపరచండి.
యెహోవా, మీ కరుణ, మీ మారని ప్రేమ జ్ఞాపకం చేసుకోండి,
ఎందుకంటే, అవి అనాది కాలంనాటి నుండి ఉన్నాయి.
యవ్వనంలో నేను చేసిన పాపాలు,
నా తిరుగుబాటుతనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోకండి;
మీ మారని ప్రేమను బట్టి నన్ను జ్జాపకముంచుకోండి.
ఎందుకంటే యెహోవా మీరు మంచివారు.
యెహోవా, లోతైన స్థలంలో నుండి నేను మీకు మొరపెడతాను;
ప్రభువా, నా స్వరం వినండి.
దయ కోసం నేను చేసే మొర
మీ చెవులు శ్రద్ధతో విననివ్వండి.
యెహోవా, మీ కరుణను నాకు దూరం చేయకండి;
మీ మారని ప్రేమ మీ విశ్వాస్యత నిత్యం నన్ను కాపాడును గాక.
నిశ్చయంగా నా జీవితకాలమంతా
మీ మంచితనం మీ మారని ప్రేమ నావెంటే ఉంటాయి.
నేను నిరంతరం
యెహోవా మందిరంలో నివసిస్తాను.
తండ్రి తన పిల్లల మీద కనికరం కలిగి ఉన్నట్లు,
తనకు భయపడేవారి పట్ల యెహోవా కనికరం కలిగి ఉన్నారు;
Graça e perdão
Onde o pecado abundou, superabundou a graça. Deus convida todos ao arrependimento e promete perdão total aos que confessam.
అయితే కృపావరమనేది అతిక్రమం వంటిది కాదు. ఒకవేళ ఒకని అతిక్రమాన్ని బట్టి అనేకమంది మరణిస్తే దేవుని కృప, యేసు క్రీస్తు అనే ఒక్క మనుష్యుని కృప చేత వచ్చిన కృపావరం అనేకమందికి విస్తరిస్తుంది కదా!
నీతికి దాసులు
అయితే మనం ధర్మశాస్త్రం క్రింద కాదు గాని కృప కలిగి ఉన్నాం కాబట్టి మనం పాపం చేయవచ్చా? చేయనే కూడదు!
అయినప్పటికీ, దేవుడు తన మహా ప్రేమను బట్టి, ఆయన కరుణాసంపన్నతను బట్టి మనం మన అతిక్రమాలలో పాపాల్లో చచ్చినవారిగా ఉండగా, క్రీస్తుతో పాటు మనల్ని బ్రతికించారు. ఆయన కృప చేత మీరు రక్షించబడ్డారు.
అందుకు, "నా కృప నీకు చాలు, బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతుంది" అని ఆయన నాతో చెప్పారు. అందువల్ల క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండేలా నా బలహీనతల్లోనే నేను గర్విస్తాను.
తమ పాపాలను దాచిపెట్టేవారు వర్ధిల్లరు,
కాని వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవారు కనికరం పొందుతారు.
దుష్టులు తమ మార్గాలను
అవినీతిపరులు తమ ఆలోచనలు విడిచిపెట్టాలి.
వారు యెహోవా వైపు తిరిగితే ఆయన వారిపై జాలి పడతారు.
మన దేవుడు వారిని ఉచితంగా క్షమిస్తారు.
అయినా, యెహోవా మీమీద దయ చూపించాలని కోరుతున్నారు;
కాబట్టి మీ పట్ల దయ చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు.
యెహోవా న్యాయం తీర్చే దేవుడు
ఆయన కోసం ఎదురు చూసే వారందరు ధన్యులు!
Misericórdia e compaixão
Misericórdia quero e não sacrifício. Deus nos chama a ser misericordiosos como Ele é, perdoando e acolhendo o próximo.
అందుకే మీరు వెళ్లి, ‘నేను దయను కోరుతున్నాను, బలిని కాదు’ అంటే అర్థం ఏంటో తెలుసుకోండి: ఎందుకంటే నేను నీతిమంతులను పిలువడానికి రాలేదు, పాపులను పిలవడానికి వచ్చాను" అన్నారు.
కరుణలేని ఒక సేవకుని గురించిన ఉపమానం
అప్పుడు పేతురు యేసు దగ్గరకు వచ్చి, "ప్రభువా, నా సహోదరుడు నాకు విరోధంగా తప్పు చేస్తే నేను ఎన్ని సార్లు అతన్ని క్షమించాలి, ఏడుసార్లు క్షమించాలా?" అని అడిగాడు.
అందుకు యేసు అతనితో, "ఏడు సార్లే కాదు కాని డెబ్బై ఏడుసార్లు వరకు క్షమించాలి అని నీతో చెప్తున్నాను.
మీరు ఇతరుల పాపాలను క్షమిస్తే మీ పరలోకపు తండ్రి కూడ మిమ్మల్ని క్షమిస్తారు.
అయితే మీ గొప్ప కనికరాన్ని బట్టి మీరు వారిని పూర్తిగా నాశనం చేయలేదు, విడిచిపెట్టలేదు. మీరు దయా కనికరంగల దేవుడవు.
దయతో అప్పు ఇచ్చేవారికి,
తమ వ్యాపారాన్ని న్యాయంగా నిర్వహించే వారికి మేలు కలుగుతుంది.
మన ప్రభువైన దేవుని దయ మనమీద ఉండును గాక;
మా చేతి పనులను మాకోసం స్థిరపరచండి,
అవును, మా చేతి పనులను స్థిరపరచండి.
Acessar a misericórdia
Cheguemos com confiança ao trono da graça. Ali encontramos misericórdia e graça para socorro no tempo oportuno.
కాబట్టి మన అవసర సమయంలో సహాయపడేలా కనికరం కృప పొందడానికి మనం ధైర్యంగా దేవుని కృపా సింహాసనాన్ని సమీపిద్దాము.
సజీవ యాగం
కాబట్టి, సహోదరీ సహోదరులారా, పరిశుద్ధమైనది దేవుని సంతోషపరచే సజీవయాగాలుగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోమని దేవుని కృపను బట్టి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇదే మీ నిజమైన సరియైన ఆరాధన.
దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు కాబట్టి ఆయనలో విశ్వాసముంచిన వారు నశించకుండా నిత్యజీవాన్ని పొందుకోవాలని తన ఏకైక కుమారుని అనుగ్రహించారు.
మీరు క్రీస్తులో విశ్వాసం ఉంచడమే కాదు, ఆయన కోసం శ్రమలు కూడా అనుభవించాలని ఆయన తరపున ఇది మీకు ఇవ్వబడింది,
హిజ్కియా పస్కా పండుగ ఆచరించుట
ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవాకు పస్కాపండుగ ఆచరించడానికి యెరూషలేములో యెహోవా ఆలయానికి రమ్మని హిజ్కియా ఇశ్రాయేలు ప్రజలకు యూదా ప్రజలకు అందరికి కబురు పంపాడు. ఎఫ్రాయిం, మనష్షే గోత్రాలకు కూడా లేఖలు వ్రాసి పంపాడు. రాజు, అతని అధికారులు, యెరూషలేములో ఉన్న సమాజమంతా రెండవ నెలలో పస్కాను జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే, తగినంత మంది యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకోకపోవడం, ప్రజలు యెరూషలేములో సమావేశం కాకపోవడం వలన ఎప్పుడు జరిపే సమయంలో వారు పండుగ జరుపుకోలేకపోయారు. ఆ విషయం రాజుకు సమాజం వారందరికి అంగీకారంగా ఉంది. ప్రజలంతా యెరూషలేముకు వచ్చి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరుపుకోవాలని బెయేర్షేబ నుండి దాను వరకు ఇశ్రాయేలు అంతటా ప్రకటించాలని వారు నిర్ణయించుకున్నారు. చాలాకాలంగా వ్రాయబడిన ప్రకారం పెద్ద సంఖ్యలో ప్రజలు పండుగ జరుపుకోలేదు.
రాజు, అతని అధికారుల నుండి ఉత్తరాలు తీసుకుని వార్తాహరులు రాజాజ్ఞ ప్రకారం యూదా, ఇశ్రాయేలు దేశమంతా వెళ్లారు. ఆ ఉత్తరంలో ఇలా వ్రాసి ఉంది:
"ఇశ్రాయేలు ప్రజలారా, అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపుకు తిరగండి. అష్షూరు రాజుల చేతిలో నుండి తప్పించుకుని మిగిలి ఉన్న మీ దగ్గరకు ఆయన తిరిగి వస్తారు. తమ పూర్వికుల దేవుడైన యెహోవాకు నమ్మకద్రోహం చేసిన మీ తల్లిదండ్రుల్లా మీ తోటి ఇశ్రాయేలీయుల్లా ఉండకండి. మీరు చూస్తున్నట్లుగా ఆయన వారిని నాశనానికి అప్పగించారు. మీ పూర్వికుల్లా మూర్ఖంగా ప్రవర్తించకుండ యెహోవాకు లోబడండి. ఆయన శాశ్వతంగా పవిత్రం చేసి ప్రత్యేకించుకున్న పరిశుద్ధాలయంలోకి రండి. మీ దేవుడైన యెహోవాను సేవించండి, అప్పుడు ఆయన తీవ్రమైన కోపం మీమీద నుండి మళ్ళవచ్చు. మీరు యెహోవా వైపు తిరిగితే మీ తోటి ఇశ్రాయేలీయులపై మీ పిల్లలపై వారిని బందీలుగా తీసుకువెళ్లిన వారికి కనికరం కలుగుతుంది. వారు ఈ దేశానికి తిరిగి వస్తారు. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా దయ కరుణ గలవారు. మీరు ఆయన వైపు తిరిగితే ఆయన మీ నుండి తన ముఖం త్రిప్పుకోరు."
వార్తాహరులు జెబూలూను ప్రదేశం వరకు ఎఫ్రాయిం మనష్షేల దేశాల్లోని ప్రతి పట్టణానికి వెళ్లారు. అయితే ప్రజలు వారిని తృణీకరించి నవ్వులపాలు చేశారు. కాని, ఆషేరు, మనష్షే, జెబూలూను గోత్రాల్లో కొంతమంది తమను తాము తగ్గించుకొని యెరూషలేముకు వచ్చారు. యెహోవా ఆదేశం ప్రకారం రాజు, అతని అధికారులు ఆజ్ఞాపించిన వాటిని నెరవేర్చేటట్టు యెహోవా హస్తం యూదా వారి మీద ఉంది. ఆయన వారికి ఏక మనస్సు కలిగించారు.
రెండవ నెలలో పులియని రొట్టె పండుగ ఆచరించడానికి ప్రజలు గొప్ప సమూహంగా యెరూషలేములో సమకూడారు. యెరూషలేములో ఉన్న ఇతర బలిపీఠాలను వారు తొలగించారు. ధూపవేదికలు తీసివేసి కిద్రోను లోయలో పడవేశారు.
రెండవ నెల పద్నాలుగవ రోజున వారు పస్కాబలి గొర్రెపిల్లను వధించారు. యాజకులు లేవీయులు సిగ్గుపడి, తమను పవిత్రం చేసుకుని యెహోవా ఆలయానికి దహనబలులు తెచ్చారు. దైవజనుడైన మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రకారం వారికి నియమించిన స్థలంలో యధావిధిగా వారు నిలబడ్డారు. లేవీయులు యాజకుల చేతికి రక్తం అందించగా వారు దానిని బలిపీఠం మీద చల్లారు. ఆ గుంపులో తమను పవిత్రం చేసుకోని వారు చాలామంది ఉన్నారు. అలా అపవిత్రంగా ఉండి తమ పస్కాబలి గొర్రెపిల్లలను యెహోవాకు ప్రతిష్ఠ చేయలేని ఆ వ్యక్తులందరి కోసం లేవీయులు వాటిని వధించవలసి వచ్చింది. ఎఫ్రాయిం మనష్షే, ఇశ్శాఖారు, జెబూలూను ప్రదేశాల నుండి వచ్చిన వారిలో చాలామంది తమను పవిత్రం చేసుకోలేదు. అయినా లేఖనాలకు విరుద్ధంగా వారు పస్కాను తిన్నారు. వారి కోసం హిజ్కియా ఇలా ప్రార్థన చేశాడు: "మంచివారైన యెహోవా, ప్రతి ఒక్కరిని క్షమించును గాక! పరిశుద్ధాలయ నియమాల ప్రకారం అపవిత్రంగా ఉన్నప్పటికీ, తమ పూర్వికుల దేవుడైన యెహోవాను వెదికితే అలాంటి వారందరినీ యెహోవా క్షమించును గాక." యెహోవా హిజ్కియా ప్రార్థన విని ప్రజలను బాగుచేశారు.
యెరూషలేములో హాజరైన ఇశ్రాయేలు వారు మహానందంతో పులియని రొట్టె పండుగ ఏడు రోజులు ఆచరించారు. ప్రతిరోజు లేవీయులు, యాజకులు యెహోవాకు పాటలు పాడారు. యెహోవాను స్తుతిస్తూ వాయిద్యాలు వాయించారు.
యెహోవా సేవ విషయంలో మంచి తెలివితేటలు చూపిన లేవీయులందరితో హిజ్కియా ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడాడు. ఏడు రోజులు వారు తమ నియమిత భాగాలు తింటూ, సమాధానబలులు అర్పిస్తూ, తమ పూర్వికుల దేవుడైన యెహోవాకు స్తుతులు చెల్లించారు.
సమాజమంతా మరో ఏడు రోజులు పండుగ జరుపుకోవాలని నిశ్చయించుకొని మరో ఏడు రోజులు ఆనందంగా జరుపుకున్నారు. యూదా రాజైన హిజ్కియా సభకు 1,000 కోడెలను 7,000 గొర్రెలను మేకలను అందించాడు, అధికారులు వారికి 1,000 ఎద్దులను 10,000 గొర్రెలు మేకలను అందించారు. పెద్ద సంఖ్యలో యాజకులు తమను తాము పవిత్రం చేసుకున్నారు. అప్పుడు యాజకులు, లేవీయులు, యూదావారిలో నుండి ఇశ్రాయేలీయులలో నుండి వచ్చిన సమాజపువారందరు, ఇశ్రాయేలు దేశం నుండి వచ్చి యూదాలో నివసిస్తున్న విదేశీయులు కూడా సంతోషించారు. యెరూషలేమంతా ఎంతో సంతోషంగా ఉంది. ఇశ్రాయేలు రాజైన దావీదు కుమారుడైన సొలొమోను కాలం నుండి అంతవరకు యెరూషలేములో ఇలాంటిది జరుగలేదు. లేవీయులైన యాజకులు లేచి ప్రజలను దీవించారు. వారి ప్రార్థన దేవుడు పవిత్ర నివాసమైన పరలోకానికి చేరింది. ఆయన వారి ప్రార్థన విన్నారు.
"ఒక పురుషుడు తన భార్యకు విడాకులు ఇచ్చి,
ఆమె అతన్ని విడిచిపెట్టి మరొక వ్యక్తిని పెళ్ళి చేసుకుంటే,
అతడు మళ్ళీ ఆమె దగ్గరకు వెళ్లాలా?
దేశమంతా పూర్తిగా అపవిత్రమవదా?
అయితే నీవు చాలామంది ప్రేమికులతో వేశ్యగా జీవించావు,
ఇప్పుడు నా దగ్గరకు తిరిగి వస్తావా?"
అని యెహోవా ప్రకటిస్తున్నారు.
"కళ్లు పైకెత్తి ఆ బంజరు కొండలను చూడు.
నీవు అత్యాచారానికి గురి కాని ప్రదేశం ఏదైనా ఉందా?
ప్రేమికుల కోసం రోడ్డు ప్రక్కన ఎదురుచూస్తూ కూర్చున్నావు,
ఎడారిలో అరబీయునిగా కూర్చున్నావు.
నీ వ్యభిచారంతో, దుర్మార్గంతో
దేశాన్ని అపవిత్రం చేశావు.
కాబట్టి వాన జల్లులు ఆగిపోయాయి,
వసంత వర్షాలు కురవలేదు.
అయినా నీవు వేశ్యలా సిగ్గుపడడానికి తిరస్కరిస్తున్నావు;
నీవు సిగ్గుపడడానికి నిరాకరిస్తున్నావు.
నీవు ఇప్పుడే నన్ను పిలిచి:
‘నా తండ్రీ, నా చిన్నప్పటి నుండి నా స్నేహితుడవు,
నీవు ఎప్పటికీ కోపంగా ఉంటావా?
నీ ఉగ్రత ఎప్పటికీ ఉంటుందా?’
నీవు ఇలా మాట్లాడతావు,
కానీ నీవు చేయగలిగిన కీడంతా చేస్తావు."
నమ్మకద్రోహియైన ఇశ్రాయేలు
యోషీయా రాజు పాలనలో యెహోవా నాతో ఇలా అన్నారు, "నమ్మకద్రోహియైన ఇశ్రాయేలు ఏమి చేసిందో చూశావా? ఆమె ఎత్తైన ప్రతి కొండ మీదికి, పచ్చని ప్రతి చెట్టు క్రిందికి వెళ్లి, వ్యభిచారం చేసింది. ఇదంతా చేసిన తర్వాత ఆమె నా దగ్గరకు తిరిగి వస్తుందని నేను అనుకున్నాను, కానీ ఆమె అలా చేయలేదు, ఆమె నమ్మకద్రోహియైన సోదరి యూదా దానిని చూసింది. నేను విశ్వాసంలేని ఇశ్రాయేలుకు తన విడాకుల ధృవీకరణ పత్రాన్ని ఇచ్చి, ఆమె చేసిన వ్యభిచారాలన్నిటిని బట్టి ఆమెను పంపివేసాను. అయినప్పటికీ నమ్మకద్రోహియైన ఆమె సహోదరి యూదాకు భయం లేదని నేను చూశాను; ఆమె కూడా బయటకు వెళ్లి వ్యభిచారం చేసింది. ఇశ్రాయేలు అనైతికత ఆమె దృష్టికి చాలా తక్కువ కాబట్టి, ఆమె దేశాన్ని అపవిత్రం చేసింది, రాయితో, కలపతో వ్యభిచారం చేసింది. ఇంత జరిగినా, నమ్మకద్రోహియైన తన సహోదరి యూదా తన పూర్ణహృదయంతో నా వైపు తిరగలేదు, కేవలం నటించింది" అని యెహోవా ప్రకటిస్తున్నారు.
యెహోవా నాతో ఇలా అన్నారు: "ద్రోహియైన యూదా కంటే విశ్వాసంలేని ఇశ్రాయేలు నీతిమంతురాలు. నీవు వెళ్లి, ఉత్తరాన ఈ సందేశం ప్రకటించాలి:
" ‘ద్రోహియైన ఇశ్రాయేలూ, తిరిగి రా’ అని యెహోవా ప్రకటిస్తున్నారు,
‘ఇకపై నేను నీవైపు కన్నెత్తి చూడను,
ఎందుకంటే నేను నమ్మకస్థుడను’ అని యెహోవా ప్రకటిస్తున్నారు,
‘నేను నిత్యం కోపంగా ఉండను.
నీ అపరాధాన్ని ఒప్పుకో
నీ దేవుడైన యెహోవా మీద నీవు తిరుగుబాటు చేశావు,
నీవు ప్రతి మహా వృక్షం క్రింద
పరదేశి దేవుళ్ళకు నీ ఇష్టాన్ని పంచుకున్నావు,
నాకు విధేయత చూపలేదు’ "
అని యెహోవా ప్రకటిస్తున్నారు.
"విశ్వాసంలేని ప్రజలారా, తిరిగి రండి" అని యెహోవా ప్రకటిస్తున్నారు, "నేను నీ భర్తను కాబట్టి నేను నిన్ను ఎంచుకుంటాను ఒక పట్టణం నుండి ఒకనిగా, ఒక వంశం నుండి ఇద్దరినిగా నిన్ను సీయోనుకు తీసుకువస్తాను. అప్పుడు నేను నీకు నా హృదయానికి చాలా దగ్గరి వారైన కాపరులను ఇస్తాను, వారు జ్ఞానంతో, అవగాహనతో మిమ్మల్ని నడిపిస్తారు. ఆ రోజుల్లో దేశంలో మీ సంఖ్య బాగా పెరిగినప్పుడు" అని యెహోవా ప్రకటిస్తున్నారు, "ప్రజలు ఇకపై, ‘యెహోవా నిబంధన మందసం’ అని అనరు. అది ఎప్పటికీ వారి మనస్సులోకి ఎక్కదు, జ్ఞాపకంలో ఉండదు; అది తప్పిపోదు, మరొకటి తయారుచేయబడదు. ఆ సమయంలో వారు యెరూషలేమును యెహోవా యొక్క సింహాసనం అని పిలుస్తారు, యెహోవా నామాన్ని గౌరవించడానికి అన్ని దేశాలు యెరూషలేములో సమకూడుతాయి. ఇకపై వారు తమ దుష్ట హృదయాల మొండితనాన్ని అనుసరించరు. ఆ రోజుల్లో యూదా ప్రజలు ఇశ్రాయేలు ప్రజలతో కలిసి ఉంటారు, వారు కలిసి ఉత్తర దేశం నుండి నేను మీ పూర్వికులకు వారసత్వంగా ఇచ్చిన దేశానికి వస్తారు.
"నేను నేనే ఇలా అన్నాను,
" ‘మిమ్మల్ని నా పిల్లల్లా చూసుకుంటాను
మీకు ఆహ్లాదకరమైన భూమిని,
ఏ జాతికి చెందనంత అందమైన వారసత్వాన్ని ఇస్తాను.’
‘తండ్రీ’ అని నీవు నన్ను పిలుస్తావని అనుకున్నాను
నన్ను అనుసరించకుండ దూరంగా వెళ్లవని అనుకున్నాను.
కానీ తన భర్తకు ద్రోహం చేసిన స్త్రీలా
ఇశ్రాయేలూ, నీవు నాకు నమ్మకద్రోహం చేశావు,"
అని యెహోవా ప్రకటిస్తున్నారు.
ఇశ్రాయేలు ప్రజలు తమ మార్గాలను తప్పుదారి పట్టించి
తమ దేవుడైన యెహోవాను మరచిపోయారు కాబట్టి,
బంజరు కొండలమీద
ఇశ్రాయేలు ప్రజల ఏడ్పులు, విన్నపాలు, వినబడుతున్నాయి.
"విశ్వాసంలేని ప్రజలారా, తిరిగి రండి.
మీ విశ్వాసభ్రష్టత్వాన్ని నేను నయం చేస్తాను."
"అవును, మేము మీ దగ్గరకు వస్తాము,
ఎందుకంటే మీరే మా దేవుడైన యెహోవా.
నిశ్చయంగా కొండలు, పర్వతాలమీద జరుగుతున్న
విగ్రహారాధన అల్లకల్లోలం మోసమే;
ఖచ్చితంగా మన దేవుడైన యెహోవాలో
ఇశ్రాయేలు రక్షణ.
మన పూర్వికుల శ్రమ ఫలాలను
వారి గొర్రెలను, మందలను,
వారి కుమారులు, కుమార్తెలను
మా యవ్వనం నుండి సిగ్గుమాలిన దేవతలు తినివేశాయి.
మనం అవమానంలో పడి ఉందాం,
మన అవమానాన్ని మనల్ని కప్పివేయనిద్దాము.
మన దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా మనం పాపం చేశాము,
మనమూ, మన పూర్వికులు;
మా యవ్వనం నుండి నేటి వరకు
మనం మన దేవుడైన యెహోవా మాటకు లోబడలేదు."
Este artigo te tocou? Faça uma oração!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.