66 అప్పటినుండి ఆయన శిష్యులలో అనేకమంది వెనక్కి వెళ్లిపోయి మరి ఎన్నడు ఆయనను వెంబడించలేదు.
67 యేసు పన్నెండుమందిని, "మీరు కూడా వెళ్లాలనుకుంటున్నారా?" అని అడిగారు.
68 అందుకు సీమోను పేతురు ఆయనతో, "ప్రభువా, మేము ఎవరి దగ్గరకు వెళ్లాలి? నిత్యజీవపు మాటలను నీ దగ్గరే ఉన్నాయి. 69 నీవే దేవుని పరిశుద్ధుడవని మేము నమ్మి తెలుసుకున్నాము" అని చెప్పాడు.